మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శివాజీ నగర్లో నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న ఓఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు లక్షా 50 వేల రూపాయల విలువైన గుట్కాలను సీజ్ చేశారు.
జడ్చర్లలో టాస్క్ఫోర్స్ దాడులు.. భారీగా గుట్కా స్వాధీనం - వైష్ణవి కిరాణం దుకాణంలో 20 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న స్థావరాలపై.. మహబూబ్నగర్ జిల్లా పోలీసులు దాడులు నిర్వహించారు. జడ్చర్లలో టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈసోదాల్లో.. లక్షా 75 వేల రూపాయల విలువగల గుట్కాను సీజ్ చేసి.. ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేశారు.
![జడ్చర్లలో టాస్క్ఫోర్స్ దాడులు.. భారీగా గుట్కా స్వాధీనం Task force raids on the Zadcharla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7660914-513-7660914-1592413856214.jpg)
జడ్చర్లలో టాస్క్ఫోర్స్ దాడులు.. భారీగా గుట్కా స్వాధీనం
వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో వైష్ణవి కిరాణం దుకాణంలో 20 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. వ్యాపారి మహేశ్తోపాటు, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గుట్కా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.