తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థుల అర్ధాకలి చదువులు.. మధ్యాహ్న భోజన పరిస్థితి.! - ఉండవల్లిలో మధ్యాహ్న భోజన సమస్యలు

Mid Day Meals In Undavalli: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం.. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నరకం బియ్యం పంపిణీ చేస్తుంది. మెనూ ప్రకారం భోజనం అందేలా ఆదేశాలు ఉన్నప్పటికీ ఏదో రకంగా విద్యార్థులకు సమస్యలు వచ్చి పడుతున్నాయి. అన్నంలో రాళ్లు ఉండడం.. ఆహారం ముద్దగా ఉండడం వంటివి జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు అర్ధాకలితో చదువుకోవాల్సి వస్తుంది. ఈ సంఘటన మహబూబ్​నగర్​ జిల్లా ఉండవల్లిలో చోటుచేసుకుంది.

students
విద్యార్థులు

By

Published : Jan 11, 2023, 1:26 PM IST

Students Are Hungry In Undavalli: మహబూబ్​నగర్​ జిల్లా ఉండవల్లి మండల కేంద్రమైన జడ్పీ ఉన్నత పాఠశాలకు గురువారం నెలలో మొదటి విడతగా 8.50 క్వింటాళ్ల బియ్యం సరఫరా అయ్యాయి. ఈ పాఠశాలలో 403 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శుక్రవారం వంట ఏజెన్సీ మహిళలు బియ్యం తీసుకొచ్చి అన్నం చేసేందుకు పురమాయించారు. బియ్యంలో రాళ్లు, మెరికలు ఉండటంతో నీటిలో గాలించి తీసేందుకు చాలా సమయం పట్టింది. అంతేకాక బియ్యం నాణ్యత కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇలా గత మూడు నెలల నుంచి బియ్యం సరఫరా అవుతుండటంతో వంట ఏజెన్సీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక గతంలో రెండు పర్యాయాలు నాణ్యతలేని బియ్యాన్ని వెనక్కి పంపించినట్లు తెలిపారు. ప్రతిరోజు భోజనాన్ని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రుచి చూస్తున్నప్పటికీ ఇలాంటివి చోటు చేసుకోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్థులు వాపోయారు.

జిల్లా వ్యాప్తంగా 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కేజీబీవీ, 13 గురుకుల విద్యాలయాలుండగా 70 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతినెల పాఠశాలలకు 700 క్వింటాళ్లకు పైగా బియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే విద్యార్థులకు సరఫరా అయ్యే బియ్యం నాణ్యతగా లేకపోవడంతో పాటు అందులో రాళ్లు, మెరికల్లాంటివి వస్తున్నాయని వంట ఏజెన్సీ వారు పేర్కొంటున్నారు. అంతేకాక భోజనం చేసే విద్యార్థులు సైతం అవస్థ పడుతున్నట్లు వాపోతున్నారు. నాణ్యమైన బియ్యం సరఫరా లేనందున విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల వడ్డేపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి ఆరుమంది విద్యార్థులు వాంతులతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

"నాసిరకం బియ్యాన్ని వెనక్కి పంపించాం: గతంలో రెండు మూడుసార్లు పాఠశాలకు వచ్చిన నాసిరకం బియ్యాన్ని వెనక్కి పంపించాం . బియ్యం లో రాళ్లు మెరికలు వంటివి వస్తే ఆహార తయారీకి ఆలస్యమవుతుంది. బియ్యం నాణ్యత లేకపోవడంతో అన్నం ముద్దగా మెత్తగా అవుతుంది. నాణ్యత లేని బియ్యంతో వంట ఏజెన్సీ వారికి భోజనం చేసిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు .ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. సమస్యను పరిష్కరిస్తాం." - శివప్రసాద్, ఉండవల్లి, మానపాడు మండల విద్యాధికారి

"మంచి బియ్యం సరఫరా చేస్తే బాగుంటుంది: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అధికారులు నాణ్యత ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తే మంచి భోజనం అందించేందుకు వీలుంటుంది. బియ్యంలో రాళ్లు మెరుకలు ఉండడంతో భోజనం తయారీకి ఆలస్యమవుతుంది. అంతేగాక బియ్యాన్ని ఎంత గాలించిన అన్నంలో అప్పుడప్పుడు రాళ్లు వస్తుంటాయి. దీంతో విద్యార్థులు మాపై ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్థులకు సరఫరా అయ్యే బియ్యాన్ని నాణ్యతతో అందించాలని కోరుతున్నాం." -హుస్సేన్ బి, ఉండవల్లి జడ్పీహెచ్ఎస్, వంట ఏజెన్సీ మహిళ

"ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం..: భోజనంలో అప్పుడప్పుడు రాళ్లు వస్తుండటం, మెత్తగా, ముద్దగా ఉండటంతో అన్నం తినేందుకు చాలా మంది విద్యార్థులు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో అప్పుడప్పుడు కడుపునొప్పితో పాటు, అజీర్తి కారణంగా వాంతులు చేసుకుంటున్నారు. అనారోగ్య కారణంతో.. చదువుపై దృష్టి సారించేందుకు ఇబ్బందులు పడుతున్నాము." - లహరి, 8వ తరగతి, ఉండవల్లి జడ్పీహెచ్ఎస్

ఉండవల్లి ప్రభుత్వ స్కూల్​ విద్యార్థుల అవస్థలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details