తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2021, 10:36 PM IST

ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు పోస్టల్ ద్వారా ఓటు అవకాశమివ్వండి'

జడ్చర్ల మున్సిపాలిటీలో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీధర్ పర్యటించారు. పట్టణంలో జరగబోయే ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

jadcherla municipal elections
జడ్చర్ల మున్సిపల్​ ఎన్నికలు

జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీధర్ సమావేశమయ్యారు. పట్టణంలో ఈ నెల 30న జరగబోయే ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులను కోరారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

కొవిడ్ పాజిటివ్​ వచ్చిన వారితో పాటు.. 80 సంవత్సరాల పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

ఇదీ చదవండి:అమల్లోకి రాత్రి కర్ఫ్యూ.. మే 1 వరకు ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details