తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకంపల్లిలో  చోటు చేసుకుంది. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

By

Published : Jun 6, 2019, 7:23 PM IST

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకంపల్లి రోడ్డు మలుపులో ఆత్మకూర్ వైపు నుంచి స్కూటీపై వేగంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో మహబూబ్​నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details