దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కలిసి వినతిపత్రం అందజేశారు.
అత్యవసర వైద్యం అందక..
దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, అడ్డాకుల, మూసాపేట, బూత్పూర్ మండలాలు జాతీయ రహదారిపై ఉన్నందున.. ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్లు లేనందున ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను మహబూబ్ నగర్, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. గాయపడ్డ వారికి అత్యవసరమైన వైద్యం అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారని.. వారి కుటుంబాలకు దిక్కులేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.