తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన ఘర్షణల్లో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా అజీజ్నగర్లో పోలింగ్ను నిలిపివేశారు. ప్రస్తుతం తుది విడత ఎన్నికల్లో ఆ రెండు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తొలి విడతలో వివాదం... తుది విడతలో ప్రశాంతం - MPTC
తొలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో వివాదం జరగడం వల్ల ఎన్నికలను బహిష్కరించారు రెండు గ్రామాల ప్రజలు. తుదివిడతలో రీపోలింగ్ నిర్వహిస్తున్నందున ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తొలి విడతలో వివాదం... తుది విడతలో ప్రశాంతం
Last Updated : May 14, 2019, 12:21 PM IST