తెలంగాణ

telangana

ETV Bharat / state

డిజిటల్​ విధానంలో దేహదారుఢ్య పరీక్షలు

పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇవాళ మొదలైన దేహదారుఢ్య పరీక్షలు మార్చి 8 వరకు 22 రోజులపాటు జరగనున్నాయి. పొరపాట్లకు తావులేకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు.

By

Published : Feb 11, 2019, 2:42 PM IST

దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లు పరిశీలన

దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లు పరిశీలన
ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో పోలీస్ రిక్రూట్​మెంట్ మొదలైంది. 21,466 మంది అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించారు. జిల్లా క్రీడా మైదానంలో దేహదారుఢ్య పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులతో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సమావేశమై దిశానిర్దేశం చేశారు.

అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షల్లో ఈసారి పోలీసు అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సెన్సర్లు, చిప్​లు, సీసీ కెమెరాల ద్వారా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details