డిజిటల్ విధానంలో దేహదారుఢ్య పరీక్షలు
పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇవాళ మొదలైన దేహదారుఢ్య పరీక్షలు మార్చి 8 వరకు 22 రోజులపాటు జరగనున్నాయి. పొరపాట్లకు తావులేకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు.
దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లు పరిశీలన
అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షల్లో ఈసారి పోలీసు అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సెన్సర్లు, చిప్లు, సీసీ కెమెరాల ద్వారా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు.