తెలంగాణ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఎస్పీ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. తెలంగాణ చౌరస్తాలో దుకాణ యజమానులను కలిసి దుకాణాలు సమయానికి మూసి వేయాల్సిందిగా సూచించారు.
జిల్లా ప్రజలు, వ్యాపారవేత్తలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఎమర్జెన్సీ సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియా, ఇతర అత్యవసర విభాగాలకు మినహాయింపు ఉంటుందని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తుల నివారణ చట్టాల మేరకు జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు.