తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం

ఎదురెదురుగా వస్తున్న జీపు, ద్విచక్ర వాహనం ఢీకొన్న  ఘటనలో ఓ వ్యక్తి తల పగిలి స్పాట్​లో ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్ నగర్  జిల్లా  దేవరకద్ర  మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

By

Published : Nov 9, 2019, 4:49 PM IST

రోడ్డు ప్రమాదంలో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో భారత్ పెట్రోలియం బంక్ దగ్గర ఎదురెదురుగా వస్తున్న జీపు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్​ నడుపుతున్న వ్యక్తికి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details