మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో కోటి విత్తన బంతులు వేసే కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేట సమీపంలోని ప్రభుత్వ భూముల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి వెంకట్రావు వెల్లడించారు.
9 రోజుల్లో కోటి విత్తన బంతులు..
ఆరోవిడత హరితహారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో కోటి మొక్కలు నాటడంతో పాటు.. కోటి విత్తన బంతులు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో 9 రోజుల్లో కోటి విత్తన బంతుల తయారీని పూర్తి చేశారు.