రాష్ట్రంలో రెండు స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులకు అత్యంత కీలకమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. పీవీ పేరును వాడుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. వాణీదేవి మరో శంకరమ్మ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెరాస అభ్యర్థిని ఎన్నుకోవడం వల్ల పట్టభద్రులకు కలిగే ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల పేరుతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
మూడు నెలల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..