తెలంగాణ

telangana

By

Published : Aug 20, 2020, 7:34 PM IST

ETV Bharat / state

నేలకూలిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి

వరుసగా కురుస్తున్న వర్షాలకు నేలకూలిన నివాస గృహాలను మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.

mla-ala-venkateshwar-reddy-visited-venkatagiri
mla-ala-venkateshwar-reddy-visited-venkatagiri

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటగిరి గ్రామంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి పర్యటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేలకూలిన ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడారు. వారికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.

కౌకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్​తో మాట్లాడి బాధితులకు ఏ విధమైన సాయం చేయాలో ఆ స్థాయిలో తప్పకుండా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ABOUT THE AUTHOR

...view details