Harish Rao Inaugurated Balanagar CHC: భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని... వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. భాజపా దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలను మంజూరు చేస్తే.. తెలంగాణకు మొండి చెయ్యి చూపించారని ధ్వజమెత్తారు. వైద్యారోగ్య శాఖ పనితీరుపై నీతి ఆయోగ్ నివేదిక ఇస్తే... దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని ఎంపీగా ఉన్న యూపీలో...
ప్రధానమంత్రి ఎంపీగా ఉండి డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్పుకుంటున్న ఉత్తర్ప్రదేశ్ వైద్య రంగంలో చివరి స్థానంలో ఉందని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా.. అందులో 3 కళాశాలలను ఉమ్మడి మహబూబ్నగర్కు కేటాయించామన్నారు. నెల రోజుల్లోనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 900 పడకలతో రూ. 211 కోట్లు వెచ్చించి.. ఆధునిక ఆసుపత్రిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వివరించారు.
ప్రజలను కాపాడుకుందాం...