కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను మహబూబ్నగర్ జిల్లా పాలనాధికారి రొనాల్డ్ రోస్ స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లా కలెక్టర్లకు ఈ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతని... ప్రతి ఒక్కరు మొక్కనాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్నారు.
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన పాలమూరు కలెక్టర్ - ronald ross takes the green challenge
రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను మహబూబ్నగర్ జిల్లా పాలనాధికారి రొనాల్డ్ రోస్ స్వీకరించి మొక్కలు నాటారు.

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన పాలమూరు కలెక్టర్
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన రొనాల్డ్ రోస్
ఇవీ చూడండి.. వెండితెరపై శభాష్ 'మిథాలీ'... నటి ఎవరో తెలుసా..?