తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు​ సేఫ్.. గ్రీన్​ జోన్​లోకి ఉమ్మడి జిల్లా

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో గత 20 రోజులుగా కొత్త కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కానందున ఉమ్మడి జిల్లాలన్నీ ప్రస్తుతం గ్రీన్​ జోన్​లోకి వచ్చాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే వలసజీవులకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేపట్టాకే లోనికి అనుమతిస్తున్నారు.

By

Published : May 17, 2020, 5:18 PM IST

mahabubangar district in green zone due to less cases
పాలమూరు​ సేఫ్.. గ్రీన్​ జోన్​లోకి ఉమ్మడి జిల్లా

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో లాక్​డౌన్​ ప్రశాంతంగా సాగుతోంది. గత 20 రోజులుగా కొత్త కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కానందున ఉమ్మడి జిల్లాలన్నీ ప్రస్తుతం గ్రీన్​ జోన్​లోకి వచ్చాయి. ఇప్పటివరకూ కొవిడ్​ బారినపడి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన వారంతా వ్యాధి బారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు.

నేటితో లాక్​డౌన్​ 3.0 ముగుస్తున్నందున అధికారులు నిబంధనలపై దృష్టి సారించారు. అనుమతి లేని దుకాణాలు మినహా మిగతావి తెరుచుకోనున్నాయి. ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాలంటూ అధికారులు తెలిపారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వలస జీవుల రాక కొనసాగుతోంది.

జిల్లా సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసి వారికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేపట్టాకే లోనికి అనుమతిస్తున్నారు. గ్రామస్థాయిలోనూ కొత్తగా ఎవరు ఊరిలోకి వచ్చినా క్వారంటైన్​లో ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండిఃడ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details