మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన 17సంవత్సరాల బాలు అనే యువకుడు స్థానిక ఐటీఐ కళాశాల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో తమ సమీప బంధువులకు చెందిన అమ్మాయితో ప్రేమ వ్యవహరం నడుపుతున్నాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమ విఫలం... యువకుడు ఆత్మహత్య
ప్రేమ వ్యవహారంలో వివాదం నెలకొనటం వల్ల మనస్తాపానికి గురైన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. 17 సంవత్సరాల బాలు అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ప్రేమ విఫలం... యువకుడు ఆత్మహత్య