తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 11:56 AM IST

ETV Bharat / state

ఆలయంలోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం!

అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పురాతన ఆలయంలోకి లారీ దూసుకెళ్లిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆలయం పాక్షికంగా దెబ్బతినగా.. లారీ బోల్తా పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Lorry Collided Temple in Mahabub nagar district Midgil
ఆలయంలోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ప్రమాదం!

మహబూబ్​ నగర్​ జిల్లా మిడ్జిల్​ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ లారీ రోడ్డు పక్కన గల పురాతన ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జాతీయ రహదారి 167 మీదుగా కల్వకుర్తి నుంచి జడ్చర్ల వైపు పత్తి విత్తనాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి దూసుకెళ్లింది. అయితే.. లారీ ఢీకొట్టడం వల్ల ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. ఆలయం గోడలు కూలిపోయి మూలవిరాట్టు పాక్షికంగా దెబ్బతిన్నది. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడం వల్ల డ్రైవర్​ నిద్రమత్తులో ఉన్నట్టు బావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details