తెలంగాణ

telangana

By

Published : May 6, 2020, 4:53 PM IST

ETV Bharat / state

మహబూబ్​నగర్ జిల్లాలో బారులు తీరిన మద్యం ప్రియులు

లాక్​డౌన్​ అమలుతో సుమారు నెలన్నర రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. మహబూబ్​నగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం ప్రియులు ఆయా దుకాణాల ఎదుట బారులు తీరారు. ఉదయం 10గంటలకు దుకాణాలు తెరవనుండగా 8 గంటల నుంచే క్యూలైన్​లో జనం బారులు తీరారు.

8 గంటల నుంచే క్యూలైన్​లో జనం
8 గంటల నుంచే క్యూలైన్​లో జనం

మహబూబ్ నగర్​ జిల్లాలో మద్యం దుకాణల ముందు జనం ఉదయాన్నే బారులు తీరారు. జనం రాకను ముందే దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం పాటించేందుకు గుర్తులు వేసి ఉంచారు. అవసరమైన చోట బారికేడ్లనూ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పునిసరిగా ధరించాలని కోరుతూ బోర్డులు పెట్టారు. దుకాణం వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి శానిటైజింగ్ చేశారు. ఎక్సైజ్ శాఖ పెంచిన ధరలకు మద్యాన్ని విక్రయించారు. అందుబాటులో ఉన్న సరుకును వినియోగదారునికి కావాల్సినంత అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details