తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2022, 10:12 AM IST

Updated : Oct 24, 2022, 3:37 PM IST

ETV Bharat / state

నేటి నుంచి కురుమూర్తి దేవస్థాన బ్రహ్మోత్సవాలు..

Kurumurthy Devasthanam Brahmotsavam: నేడు కురుమూర్తి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండు మూడేళ్లుగా కరోనా కారణంగా సాదాసీదాగా సాగిన ఈ జాతరకు ఈసారి లక్షలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. ఈ మేరకు అధికారులు సైతం ఏర్పాట్లు చేశారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన.. కురుమూర్తి దేవస్థాన బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా సాగనున్నాయి.

Kurumurthy Devasthanam Brahmotsavam
Kurumurthy Devasthanam Brahmotsavam

నేటి నుంచి కురుమూర్తి దేవస్థాన బ్రహ్మోత్సవాలు..

Kurumurthy Devasthanam Brahmotsavam: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. కోట్లాది జనుల ఆరాధ్య దైవం మహబూబ్​నగర్ జిల్లా కురుమూర్తి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. దీపావళి పర్వదినం మొదలుకొని నెల రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా జరగనున్నాయి. వైభవంగా సాగే ఈ జాతరకు లక్షలమంది భక్తులు హాజరుతారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి ఇసుకేస్తే రాలనంత జనం వస్తుంటారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాక రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు హాజరవుతుంటారు. కుబేరుడి నుంచి తప్పించుకునేందుకు భూలోకంలో విహరించిన విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో కృష్ణానదిని దాటారని.. స్వామివారి స్పర్శకు పులకరించిన కృష్ణమ్మ.. ఆ భగవంతుకుని పాదుకలు సమర్పించిందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామివారు ఈ కొండపై స్వయంభువుగా వెలశాడని పురాణ గాధ.

కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం:కొండపై కొలువుదీరిన కురుమూర్తిని సేవించినా అట్టంహాసంగా జరిగే ఉద్దాల ఉత్సవంలో స్వామి వారి పాదుకలను దర్శించినా.. సకల బాధలు తొలగడంతో పాటు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. జాతర ముఖ్య ఘట్టాలైన అలంకరణ ఉత్సవం, ఉద్దాలోత్సవం ఈ నెల 30, 31 జరగనున్నాయి. భక్తుల కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రాజగోపారం ప్రధాన ఆకర్షణ నిలిస్తోంది. మంచినీళ్లు, మరుగుదొడ్లు, కోనేరు వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు.

భక్తుల కోసం ప్రత్యేక వసతులు:తలనీలాల మండపాన్నిసిద్ధం చేశారు. ప్రస్తుత 40 మరుగుదొడ్లతో పాటు, మొబైల్ మరుగుదొడ్లు సిద్ధం చేయనున్నారు. దాసంగాలు పెట్టేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. వేలాదిమంది భక్తులు ఒకేసారి దర్శనానికి వస్తున్నారనే గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు.. దర్శనం అనంతరం తిరిగి వచ్చే భక్తులకు వేర్వేరు మెట్ల దారులు సిద్ధం చేశారు. ప్రమాదాలు జరగకుండా రెయిలింగ్ ఏర్పాటు చేశారు.

ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 250 బస్సు సర్వీసులు యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. శాంతి భద్రతల నిమిత్తం జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల కోసం 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 120 సీసీ కెమెరాలను నిఘా కోసం వినియోగిస్తున్నారు.

ఇవీ చదవండి:తెలంగాణ తిరుపతి కురుమూర్తి దేవస్థానం.. సమస్యలకు నెలవు..!

ఫోన్‌ కాల్‌కు పర్యవసానం.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు

హిమాచల్​లో త్రిముఖ పోరు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై కాంగ్రెస్ కన్ను!

Last Updated : Oct 24, 2022, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details