తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరుకు కేసీఆర్​ ఏమీ చేయలేదు: జితేందర్​రెడ్డి

రానున్న రోజుల్లో తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని ఎంపీ జితేందర్​రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కోసం పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టేశారని మండిపడ్డారు.

By

Published : Apr 3, 2019, 7:34 AM IST

పాలమూరుకు కేసీఆర్​ ఏం చేయలేదు: జితేందర్​రెడ్డి

పాలమూరుకు కేసీఆర్​ ఏం చేయలేదు: జితేందర్​రెడ్డి
పాలమూరు జిల్లా ఎంపీగా కేసీఆర్​ ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పడినా..ఇప్పటికిీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంపీ జితేందర్​రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కోసం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో అయన పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోనుందని తెలిపారు. ఎన్నికల తర్వాత విద్యుత్​ కష్టాలు మళ్లీ మొదలవుతాయని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details