మహబూబ్నగర్ జిల్లాలో గత నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సండలించినప్పటికి.. భానుడి ప్రతాపానికి ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బయట వేడిగాలులకు తాళలేక ఇళ్లకే ఎక్కువ మంది పరిమితం అవుతున్నారు. రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు మినహా.. జనాలు బయటకు రావడం లేదు.
పాలమూరులో భానుడి భగభగలు - Temperature in Gadwal district
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పదకొండు గంటల నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత పెరిగింది. తుపాను ప్రభావం వల్ల గాలిలో తేమ శాతం తగ్గి పొడిగాలులతో ఎండల తీవ్రత పెరిగింది.
![పాలమూరులో భానుడి భగభగలు High Temperatures in Joint Mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7333131-65-7333131-1590339865340.jpg)
పాలమూరులో భానుడి భగభగలు
గత రెండు, మూడు రోజులుగా జిల్లాలో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఆదివారం రికార్డు స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాలో 44.7 డిగ్రీలు నమోదుకాగా.. నారాయణపేట జిల్లాలో 44.5 డిగ్రీలు నమోదైంది. ఇక వనపర్తి జిల్లాలో అత్యదికంగా 44.3 డిగ్రీలు... నాగర్కర్నూల్ జిల్లాలో 43.5 డిగ్రీలు, గద్వాల జిల్లాలో 43 డిగ్రీలుగా నమోదైంది.