తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యవసరాలుగా ల్యాప్​టాప్లు, సెల్​ఫోన్లు... వ్యాపారులకు లాభాలు

ఆన్​లైన్​ తరగతులు పేద, మధ్య తరగతిపై పెనుభారం మోపుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే క్లాసులు మొదలెట్టేశాయి. ఫలితంగా ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్​టాప్​లు, కంప్యూటర్లు నిత్యావసరాలుగా మారాయి. 3 ల్యాప్టాప్లు.. 6 స్మార్ట్ ఫోన్లు అన్నట్లుగా వ్యాపారాలు సాగుతుండగా.. కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.

By

Published : Aug 16, 2020, 6:38 AM IST

heavy demand for mobiles and laptops in mahaboobnagar
heavy demand for mobiles and laptops in mahaboobnagar

నిత్యవసరాలుగా ల్యాప్​టాప్లు, సెల్​ఫోన్లు... వ్యాపారులకు లాభాలు

ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ఆన్​లైన్ తరగతులు తప్పేలా లేవని దాదాపుగా తేలిపోయింది. ప్రభుత్వం అనుమతి రాకముందే ప్రైవేట్ విద్యా సంస్థలు ఆరో తరగతి నుంచి ఆన్​లైన్ తరగతులు ప్రారంభించేశాయి. బీటెక్, బీ-ఫార్మసీ తదితర కోర్సులు కొద్దిరోజుల్లో ఆన్​లైన్​లోనే ప్రారంభంకానున్నాయి. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు సైతం పెరిగిపోయారు. అవకాశం ఉన్న ప్రతిచోటా 30 నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆన్​లైన్​ తరగతుల కోసం తల్లిదండ్రులు ఫోన్లు కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్​టాప్​లు కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు ట్యాబ్స్, వెబ్ కెమెరాలు, సౌండ్ సిస్టమ్, హెడ్ ఫోన్స్, వైఫై రూటర్స్, డాంగిల్స్ వంటి వాటికి నెలరోజుల్లోనే గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. 200 రెట్లు అధికంగా అమ్ముడవుతున్నాయని ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 20 కోట్ల వ్యాపారం జరుగుతోంది.

గతంలో కేవలం ఫోన్ మాట్లాడటానికి మాత్రమే రీఛార్జులు చేసేవాళ్లు.. ఇప్పడు డాటాను సమకూర్చుకుంటున్నారు. ఆన్​లైన్​ తరగతులు, ఇంటి నుంచే పని చేయాలంటే.. డాటా గతంలో కంటే 200 శాతం అధికంగా అవసరం అవుతోంది. కంప్యూటర్లు, మొబైళ్లు, ల్యాప్టాప్లు రిపేర్లు కూడా అధికమయ్యాయి. వేలు పోసి కొత్తవి కొనడం కంటే.. ఉన్నవాటికి మరమ్మతు మేలనుకుంటున్నారు.

ఆన్​లైన్ తరగతులు వినేందుకు కనీసంగా 10వేలు పెట్టి మొబైల్ కొనడం మధ్యతరగతి వారికి మోయలేని భారంగా తయారైంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే.. 20 నుంచి 30వేలకు పెరుగుతోంది. ఇక ల్యాప్​టాప్​లకైతే రూ. 30వేలు. రిపేర్లు, రీఛార్జీలు అన్నీ కలిసి మూలిగేనక్కపై తాటిపండు చందంగా పరిస్థితి మారింది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుండగా కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారింది.

వ్యాపారులు సైతం ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల్ని పెంచేసి అమ్ముతున్నారు. అదేమంటే స్టాక్ అందుబాటులో లేదనే సమాధానం ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details