తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2020, 7:27 AM IST

ETV Bharat / state

మొక్కల పండగ.. మోదం నిండుగ..

హరితహారం మొదలైందంటే రాష్ట్రవ్యాప్తంగా ఒకటే సందడి.. పెద్దసంఖ్యలో పిల్లలు, పెద్దలు మొక్కలు నాటేందుకు పోటీపడుతుంటారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఎక్కువ మంది బయటకు రాలేని స్థితి.. వచ్చినా భౌతికదూరం పాటించక తప్పని పరిస్థితి.. అలా కాస్త సందడి తగ్గినా డ్రోన్ల రూపేణా మొక్కల పండగ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆకాశమార్గాన హరిత సందడి సృష్టిస్తోంది.

harithaharam with the use of drones in mahabubnagar district
మొక్కల పండగ.. మోదం నిండుగ..

మహిళా సంఘాలు కోట్లాది విత్తన బంతులు తయారుచేస్తున్నాయి. కొందరికి ఇది కొత్తగా ఆదాయవనరుగా మారి ఆసరాగా నిలిచింది. తయారుచేసిన విత్తన బంతుల్ని అటవీప్రాంతాల్లో ఆ శాఖ డ్రోన్ల ద్వారా చల్లిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో యువ బృందాలూ కార్యక్రమంలో పాలుపంచుకోవటం శుభ పరిణామం.

గిన్నిస్‌లో చోటుకు పాలమూరు ప్రయత్నం

మహిళా సంఘాల భాగస్వామ్యంతో పాలమూరు జిల్లాలో 9 రోజుల్లోనే 1.12 కోట్ల విత్తనబంతులు (సీడ్‌బాల్స్‌) తయారుచేసి చల్లారు. 284 గ్రామాలు, 5,880 మహిళా సంఘాలు, 69,220 మంది మహిళలు వీటి తయారీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మర్రి, రావి, మేడి, సీతాఫలం, వేప, చింత, జువ్వి తదితర విత్తన బంతులను 3 డ్రోన్లతో జిల్లావ్యాప్తంగా అడవులు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో చల్లారు. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’కు దరఖాస్తు చేసుకున్నారు. దూరదృశ్య సమీక్ష ద్వారా ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ ప్రతినిధులకు జిల్లా కలెక్టరు ఎస్‌.వెంకట్‌రావు వివరించారు. చల్లినవాటిలో 53%-80% మధ్య విత్తనాలు మొలుకెత్తే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'

ABOUT THE AUTHOR

...view details