గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అక్కడి అధ్యాపకులు ఆకుకూరలతో దేశపటం రూపంలో హరిత భారతాన్ని రూపొందించారు.
ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం - Green India with vegetables in Jadcherla
72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ప్రభుత్వ కళాశాల వినూత్న ప్రయత్నం చేసింది. ఆరోగ్యం, పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కూరగాయలతో హరిత భారతాన్ని రూపొందించారు.
![ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం Green India map with vegetables at Jadcherla college in mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10381776-179-10381776-1611625411637.jpg)
ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం
గత డిసెంబర్ 31న దేశపటాన్ని గీసి అందులో మెంతులు, గోంగూర విత్తనాలు చల్లారు. తరవాతి రోజు నుంచి నీటిని అందిస్తూ ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణంపై స్పృహ కల్పించడానికి ఇలా హరిత భారతాన్ని రూపొందించామంటారు అధ్యాపకులు.
- ఇదీ చూడండి :జెండా పండుగకు ముస్తాబు చేసిన ప్రాంగణాలు