మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆంజనేయులు అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. వర్షాకాలం ఆరంభం కావడం, తోటి రైతులంతా సాగు మొదలు పెట్టడం చూసి.. తాను కూడా తనకున్న రెండెకరాల భూమిలో సాగు చేద్దామనుకున్నాడు. విత్తనాలు, ఎరువులు ఇతర ఖర్చుల కోసం అప్పు కోసం ప్రయత్నించాడు.
ఎంత తిరిగినా ఆంజనేయులుకు అప్పు దొరకలేదు. దీనికి తోడు.. అంతకు ముందే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. అప్పు దొరకకపోవడం, పాత అప్పులు తీర్చలేకపోవడం వల్ల మనస్తాపం చెంది.. వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.