రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసం జగన్తో దోస్తిీ చేస్తున్నారని భాజపా నేత మాజీ ఎంపీ జితేందర్రెడ్డి అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి పోత్తిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని తోడుకుపోతే మండిపడిన కేసీఆర్... ఇప్పుడు ప్రతిరోజు 88వేల క్యూసెక్కుల నీటిని తోడుకుపోయేందుకు జీవోను తీసుకువస్తే.. ఎందుకు మౌనంగా ఉన్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే పాలమూరు జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టులతో పాటు ఇంటింటికి నీరందించే మిషన్ భగీరథ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు.
'ఓట్ల కోసమే జగన్తో కేసీఆర్ దోస్తీ' - కేసీఆర్
హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రా, రాయలసీమ ప్రజల ఓట్ల కోసమే కేసీఆర్ పోత్తిరెడ్డిపాడు విషయంలో నోరు మెదపడం లేదని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఆరోపించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్తో దోస్తి కడుతున్నారని మండిపడ్డారు.
!['ఓట్ల కోసమే జగన్తో కేసీఆర్ దోస్తీ' Former MP Jitender Reddy criticized Pottireddipadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7167545-275-7167545-1589281614606.jpg)
Former MP Jitender Reddy criticized Pottireddipadu
ఏ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగిందని... దీనికి సంబంధించి ప్రధానితో పాటు సీడబ్ల్యూసీ, సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేవలం రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం... హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రా, రాయలసీమ ప్రజల ఓట్ల కోసం కేసీఆర్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
ఇదీ చదవండిఃహైదరాబాద్ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..