తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా లాక్​డౌన్​.. కాలినడకనే స్వగ్రామాలకు..

పాలమూరు జిల్లాలో తొలిరోజు లాక్​డౌన్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఐదు జిల్లాల పరిధిలో పోలీస్​ చెక్​పోస్టులు ఏర్పాటుచేసి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉదయం పది తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస్సు సర్వీసులు లేకపోవడం వల్ల కాలినడకనే స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.

By

Published : May 12, 2021, 3:28 PM IST

FIRST DAY LOCKDOWN IN PALAMOOR
పాలమూరు జిల్లాలో తొలిరోజు లాక్​డౌన్​

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో లాక్​డౌన్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 10 గంటలకే అన్ని దుకాణాలు మూసేసి.. వ్యాపారులు ఇళ్లకు చేరుకున్నారు. తొలిరోజు కావడం వల్ల ఉదయం 11 గంటల వరకూ జనం రద్దీ కనిపించింది. అనంతరం రహదారులు క్రమంగా నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర, మినహాయింపు ఇచ్చిన రంగాల వ్యక్తులు తప్ప రోడ్లపై జనం కనిపించలేదు. మహబూబ్​నగర్​ పట్టణంలో లాక్​డౌన్​ పరిస్థితిని ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.

జనాన్ని ఇబ్బంది పెట్టేందుకు లాక్​డౌన్​ విధించలేదని.. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకే అమలుచేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఐదు జిల్లాల సరిహద్దుల వద్ద పోలీస్​ చెక్​పోస్ట్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నారాయణపేట జిల్లాలో జలాల్​పూర్​, వాసవీనగర్​, కానుకుర్తి, ఎక్లాస్​పూర్, చేగుంటలో చెక్​ పోస్టులు ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పుల్లూర్, నందిన్నె వద్ద చెక్​ పోస్టులు పెట్టారు. పుల్లూరు టోల్​ప్లాజా నుంచి తెలంగాణ జిల్లా వైపు వచ్చే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు అమలు చేయడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా సొంత జిల్లాలకు చేరుకున్న వారు గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బస్సులు లేకపోవడంతో కొందరు కాలినడకనే గ్రామాలకు బయలు దేరారు.

ఇవీచూడండి:తెలంగాణకు తాళం.. కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABOUT THE AUTHOR

...view details