31న కేసీఆర్ సభ...
తెరాస అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. నాగర్ కర్నూల్లో అభ్యర్థి పోతుగంటి రాములుతోపాటు మంత్రి నిరంజన్ రెడ్డి... 7 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలను సన్నద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 31న వనపర్తి, మహబూబ్నగర్ సభల్లో పాల్గోనున్నారు.
29న కమల దళపతి రాక...
మొదటి నుంచి మహబూబ్నగర్ను సెంటిమెంట్గా భావిస్తున్న భాజపా... దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనుంది. మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ తరఫున ప్రచారం చేసేందుకు ఈనెల 29న నిర్వహించే సభకు ప్రధాని మోదీ రానున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ అభ్యర్థి బంగారు శృతి జాతీయ స్థాయి నేత కావడం వల్ల కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.