నూతన రెవెన్యూ చట్టం దిశగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల తహసీల్దార్ కార్యాలయంలో కసరత్తు వేగవంతంగా జరుగుతోంది. వీఆర్వోలు, వీఆర్ఏలు మధ్యాహ్నం 3 గంటల లోగా తమ వద్ద ఉన్న దస్త్రాలు సమర్పించాలన్న ప్రభుత్వ ఆదేశంతో.. అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
రెవెన్యూ దస్త్రాల సమర్పణకు దేవరకద్ర అధికారులు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో తీసుకొస్తున్న మార్పులకు అనుగుణంగా అధికారులు సిద్ధమవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు, వీఆర్ఏలు తమ అధీనంలో ఉన్న దస్త్రాలను సమర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
రెవెన్యూ దస్త్రాల సమర్పణకు దేవరకద్ర అధికారులు సిద్ధం
దేవరకద్ర కార్యాలయంలో వీఆర్వో, వీఆర్ఏలు తమ వద్ద ఉన్న దస్త్రాలు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. భూ సమస్యల పరిష్కారానికి వచ్చే వారికి సంబంధించి ఎలాంటి సంతకాలు చేసే పరిస్థితి లేదని రెవెన్యూ సిబ్బంది నిర్మొహమాటంగా చెప్పి పంపిస్తున్నారు.
- ఇదీ చదవండీ...రాష్ట్రంలో 5లక్షలకు చేరువలో కరోనా కేసులు