రైతులకు సంబంధించిన భూ వివరాలతో పాటు పంటలు, వ్యవసాయ పరికరాలు, ఆధార్ సంఖ్యతో, చారవాణి నెంబర్లతో భారీ డేటా బేస్ను తయారు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. సాంకేతికతను సమకూర్చుకుని దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన మాస్టర్ "కీ" ని తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతుకు మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
'రైతుల సమాచారంతో భారీ డేటా బేస్కు ఏర్పాట్లు' - PALAMURU UNIVERSITY
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి కొత్త విప్లవానికి నాంది పలకబోతున్నామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్పై నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు.

వ్యవసాయానికి సంబంధించిన మాస్టర్ "కీ" ని తయారు చేస్తున్నాం : పార్థసారథి
పాలమూరు విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్పై జాతీయ సదస్సు
ఇవీ చూడండి : పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు
Last Updated : Apr 18, 2019, 8:53 PM IST