ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలో 354, వనపర్తిలో 208, నాగర్కర్నూల్లో 191, జోగులాంబ గద్వాలలో 165, నారాయణపేటలో 98 మంది కరోనా బారినపడగా... మొత్తం ఉమ్మడి జిల్లాలో 1016 కేసులు నమోదయ్యాయి.
బుధవారం 51 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా... ఒకరు మృతి చెందారు. వీరిలో ఒక పోలీసు, మరొక బ్యాంకు అధికారి ఉన్నారు. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 27 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది.