ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ పోలీస్, ఓ రెవెన్యూ ఉద్యోగి ఉన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 964కు చేరుకుంది.
ఉమ్మడి మహబూబ్నగర్లో కరోనా కలవరం.. - జిల్లాల్లో కరోనా వార్తలు
జిల్లాల్లోనూ కరోనా విస్తరిస్తోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య పెంచడంతో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు, బాధితులకు వైద్యం అందించే సిబ్బంది సైతం కొవిడ్ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
![ఉమ్మడి మహబూబ్నగర్లో కరోనా కలవరం.. corona-cases-in-mahaboobmnagar-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8122111-thumbnail-3x2-corona.jpg)
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా @964
జోగులాంబ గద్వాల జిల్లాలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోనే 15మంది వైరస్ బారిన పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో 10 మంది కొవిడ్-19 నిర్ధరణ అయింది. నారాయణపేట, నాగర్కర్నూల్ ఒక్కో జిల్లాలో 8మందికి వైరస్ సోకింది. వనపర్తిలో ని్నన ఒక్క కేసు నమోదు కాకపోవడంతో స్వల్ప ఊరట లభించింది.