తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో ప్రశాంతంగా కానిస్టేబుల్​ పరీక్షల నిర్వహణ

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో పోలీస్​ కానిస్టేబుల్​ తుది రాత పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 19 పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు.

By

Published : Apr 28, 2019, 12:11 PM IST

కానిస్టేబుల్​ పరీక్షల నిర్వహణ

పోలీస్​ కానిస్టేబుల్​ తుది రాత పరీక్షలు మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన 19 కేంద్రాల్లో సుమారు 9 వేల 985 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నిర్వహణకు 25 మంది పరిశీలకు, 57 మంది బయోమెట్రిక్​ సిబ్బందిని నియమించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కానిస్టేబుల్​ పరీక్షల నిర్వహణ

ABOUT THE AUTHOR

...view details