మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ జలాశయంలో ముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలు గత 15 రోజులుగా వళ్లూరు సమీపంలో దీక్షలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే కొందరు కాంగ్రెస్ నాయకులు దీక్షాస్థలి వద్దకు చేరుకోగా... విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నాయకులకు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాంగ్రెస్ నాయకుల ముందుస్తు అరెస్ట్ - మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుల ముందుస్తు అరెస్ట్
మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ జలాశయం బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్ రెడ్డి.. పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగానే కొందరు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
![కాంగ్రెస్ నాయకుల ముందుస్తు అరెస్ట్ mahaboobnagar congress leaders arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6366855-64-6366855-1583907549843.jpg)
కాంగ్రెస్ నాయకుల ముందుస్తు అరెస్ట్
కాంగ్రెస్ నాయకుల ముందుస్తు అరెస్ట్