ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా మలుపుతిప్పడంతో... కారు లారీని ఢీకొట్టింది.
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలు - కారు ప్రమాదం
జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగింది.
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలు
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హైమద్, ఫైజల్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.
ఇదీ చూడండి:'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 9,431 కేసులు