మహబూబ్నగర్ జిల్లా భూత్పురు మున్సిపాలిటీ కేంద్రంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. భాజపాకు చెందిన 5వ వార్డు సభ్యురాలు కృష్ణవేణి భర్త బాలస్వామితో కలిసి మంత్రి సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
తెరాస తీర్థం పుచ్చుకున్న భాజపా కౌన్సిలర్ - తెరాసలోకి భాజపా నాయకులు
భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి భర్త బాలస్వామితో కలిసి తెరాసలో చేరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
![తెరాస తీర్థం పుచ్చుకున్న భాజపా కౌన్సిలర్ BJP Leaders jump into TRS Party at Bhuthpur Municipality in Mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7929536-804-7929536-1594121071491.jpg)
భూత్పూర్లో తెరాస తీర్థం పుచ్చుకున్న భాజపా నాయకులు
వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.