తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలీ పనుల కోసం వెళ్తూ... కానరానిలోకాలకు... - CRIME NEWS IN TELANGANA

పొట్ట కూటి కోసం భర్తతో కలిసి కూలీ పనులకు వెళ్తున్న ఆ మహిళను మృత్యువు కబళించింది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... అదుపు తప్పి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లా నసురుల్లాబాదు సమీపంలో చోటు చేసుకుంది.

A WOMEN DIED IN ACCIDENT AT NASURULLABAD
A WOMEN DIED IN ACCIDENT AT NASURULLABAD

By

Published : Dec 11, 2019, 9:22 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నసురుల్లాబాదుకు చెందిన సత్తయ్య, మణెమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై కూలీ పనుల కోసం జడ్చర్ల వెళ్తున్నారు. చర్లపల్లి సమీపంలోని కల్వర్టు వద్ద వాహనం అదుపుతప్పటం వల్ల ప్రమాదం జరిగింది. ఘటనలో తీవ్ర గాయాలపాలైన మణెమ్మను మహబూబ్​నగర్​ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందూతూ మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కూలీ పనుల కోసం వెళ్తూ... కానరానిలోకాలకు...

ABOUT THE AUTHOR

...view details