తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటే.. వజ్రాయుధం..

ఎన్నికల ఢంకా మోగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

By

Published : Mar 25, 2019, 12:48 PM IST

ఓటు అవగాహన కార్యక్రమం

ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్​
మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో స్వీప్​ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సిహెచ్​ శివలింగయ్య, జూనియర్​ కామన్వెల్త్​ బంగారు పతక విజేత ఎర్ర దీక్షిత, రాష్ట్ర స్థాయి చెస్​ విజేత రాజేష్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మదర్​థెరిసా విగ్రహం వద్ద నుంచి బస్​ స్టేషన్​ వరకు ప్లకార్డులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతపై నినాదాలు చేశారు.

ప్రలోభాలకు లోను కావద్దు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్​ శివలింగయ్య విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలన్నారు.

ఇదీ చూడండి :'దేశం నాది- ఓటు నాది- సమస్య నాది'

ABOUT THE AUTHOR

...view details