తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం' - మహబూబాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి డోర్నకల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోరులో తెరాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం'
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం'

By

Published : Sep 28, 2020, 12:34 PM IST

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులే విజయం సాధిస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అక్టోబర్ 1 నుంచి ఓటరు నమోదును విజయవంతం చేయాలని కోరారు. ప్రతి వార్డుకు సమన్వయకర్తను నియమిస్తే గెలుపు ఖాయమన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో అతిపెద్ద యూఎస్​ ఎడ్యుకేషన్ ఫెయిర్​

ABOUT THE AUTHOR

...view details