వేసవికాలం రాకముందే ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలో మిరప తోట ఏరేందుకు వచ్చిన కూలీలు.. ఎండ నుంచి రక్షణ పొందడానికి గొడుగులను వినియోగిస్తున్నారు. పని చేయడానికి వచ్చిన 25 మంది కూలీల్లో 20 మంది గొడుగులు పెట్టుకుని పనిచేయడం గమనార్హం.
మిరప చేనులో గొడుగులతో ఏం చేస్తున్నారో తెలుసా?
ఇన్ని రోజులు చలికి వణికిన జనాలు.. ఇప్పటినుంచి ఎండ నుంచి రక్షణ పొందాల్సిన తరుణం వచ్చేసింది. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భయపడుతున్న వ్యవసాయ కూలీలు తమ రక్షణ కోసం గొడుగులను వినియోగిస్తున్నారు.
మిరప చేనులో గొడుగులతో ఏం చేస్తున్నారో తెలుసా?
ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 వరకు గొడుగు నీడలోనే పని చేస్తున్నామని కూలీలు చెబుతున్నారు. ఇంటి నుంచే గొడుగులు తెచ్చుకుంటున్నామని.. వేసవి ప్రారంభం కాకముందే ఎండ తీవ్రత పెరిగిందని వారు చెబుతున్నారు.
ఇదీ చూడండి: బిట్టు శ్రీనును పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు