తెలంగాణ

telangana

'మరిపెడలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు'

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో.. ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు వదిలారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ గుర్తు చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకం ఎగురవేసి.. సంబురాలు చేసుకున్నారు.

By

Published : Jun 2, 2020, 10:49 PM IST

Published : Jun 2, 2020, 10:49 PM IST

Telangana state emergence day celebrations in Dornakkal constituency
'మరిపెడలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు'

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డోర్నకల్, కురవి, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించారు.

మరిపెడలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ జాతీయ పతాకం ఎగురవేసి.. సంబురాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో.. ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు వదిలారని రెడ్యానాయక్ గుర్తు చేసుకున్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details