విద్యార్థులకు ఆటలు చాలా ముఖ్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని యతిరాజారావు పార్కులో రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలుర ఫుట్బాల్ పోటీలను ఎర్రబెల్లి ప్రారంభించారు. తాను కూడా యుక్తవయసులో ఉన్నప్పుడు కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడినని... గతంలో అసెంబ్లీ పోటీల్లో తానూ అడేవాడినని మంత్రి గుర్తుచేసుకున్నారు. రూ.3 కోట్లతో ఏడాదిలో క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
'నేనూ కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడినే...'
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని యతిరాజారావు పార్కులో రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలుర ఫుట్బాల్ పోటీలను ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. తాను యుక్తవయసులో ఉన్నప్పుడు వాలీబాల్ ఆడేవాన్నని తెలిపారు.
STATE LEVEL UNDER 17 FOOTBALL GAMES STARTED BY MINISTER ERRABELLI IN THORRUR
TAGGED:
GAMES UPDATES IN TELANGANA