RS Praveen Kumar: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న పోలేపల్లి శరణ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతురాలు రాసిన లేఖ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
శరణ్య కుటుంబానికి జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీ విషయం యువతి ప్రాణాలు పోయాక బయటికి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా పోలీసులకు తెలియకుండా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.