తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డె కల్లం..వాహనదారులకు కళ్లెం... - రహదారి పొడవునా రైతులు మూకుమ్మడిగా మొక్కజొన్నలను ఆరబోశారు

మొక్కజొన్న పంట చేతికొచ్చింది. గింజల్లో తేమ పోవాలంటే...ఆరబెట్టాల్సిందే. అందుకోసం రహదారికి మించింది మరేం ఉంటుంది. రైతులకు సౌకర్యంగానే ఉన్నా..తమకు మాత్రం ఇబ్బందికరంగా ఉందన్నారు వాహనదారులు.

వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న మెుక్కజొన్నల ఆరబోత

By

Published : Oct 17, 2019, 8:26 AM IST

మహబూబాబాద్ జిల్లాలోని జమాండ్లపల్లి నుంచి కంబాలపల్లి వరకు ఉన్న 365 జాతీయ రహదారి పొడవునా రైతులు మూకుమ్మడిగా మొక్కజొన్నలను ఆరబోశారు. రోడ్డుపైన ఆరేసిన మొక్కజొన్నలను దూరం నుంచి చూస్తే మొత్తం పచ్చరంగేసినట్లుగా కనిపించడం విశేషం. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. వాహనదారులు మాత్రం ప్రయాణం కష్టమవుతోందని వాపోతున్నారు. రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని వాహనదారులు భయాందోళన వ్యక్తం చేశారు.

వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న మెుక్కజొన్నల ఆరబోత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details