తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రీయ ఏక్తాదివస్​ని సందర్భంగా పోలీసుల కొవ్వొత్తులు ర్యాలీ - రాష్ట్రీయ ఏక్తాదివస్ వేడుకలు తాజా వార్త

రాష్ట్రీయ ఏక్తాదివస్​ వేడుకలను మహబూబాబాద్​ పట్టణ పోలీసులు ఘనంగా నిర్వహించారు. సర్దార్​ వల్లభ్​ భాయి పటేల్​ సేవలను గుర్తుచేసుకుంటూ నగరంలో కొవొత్తుల ర్యాలీ చేపట్టారు.

rashtriya ekta diwas celebrations at mahabubabad
రాష్ట్రీయ ఏక్తాదివస్​ని సందర్భంగా పోలీసుల కొవ్వొత్తులు ర్యాలీ

By

Published : Nov 1, 2020, 10:47 AM IST

రాష్ట్రీయ ఏక్తా దివస్​ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు పోలీస్ సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన దూరదృష్టి చర్యల ద్వారానే దేశ ఐక్యత సాధ్యమైందని... ఈ ఐక్యత స్ఫూర్తితో దేశ భద్రతను కాపాడటానికి నా వంతు బాధ్యత నిర్వహిస్తానంటూ వారు ప్రతిజ్ఞ చేశారు.

స్వాతంత్య్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి కృషిచేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అని.. ఆయన సేవలు ఎనలేనివని డీఎస్పీ నరేశ్​కుమార్​ అన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణ ఇంటలిజెన్స్​ చీఫ్​గా ప్రభాకర్​రావు నియామకం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details