తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2019, 3:35 PM IST

ETV Bharat / state

పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మహబూబాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. రేపు ఉదయం సెక్టోరల్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియ ఉదయం 6.30కు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులు పోలింగ్ సామాగ్రితో నేటి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

పంపిణీ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details