మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో ప్లాస్టిక్ బియ్యం గుట్టు రట్టయింది. దీనిపై ప్రశ్నించిన గ్రామస్థులకు.. సదరు దుకాణ యాజమాని నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది.
గ్రామానికి చెందిన ఓ కిరాణా దుకాణంలో మూడు రోజుల క్రితం అలకుంట్ల సైదులు 25 కిలోల బియ్యం కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లి వండి.. భోజనం చేశారు. ఆ రోజంతా ఆకలి వేయలేదని.. అనుమానంతో తర్వాత రోజు అదే బియ్యంతో వంట చేసినట్లు సైదులు తెలిపారు. ఎంత ఉడికించినా సరిగా ఉడకకపోవడం వల్ల దానికి ఓ ముద్దగా చేసి నేలపై కొట్టాడు. బంతి మాదిరిగా పైకి లేచిందని సైదులు వివరించారు. ఊరిలో పండించిన బియ్యం తెచ్చి వంట చేశామని.. కొద్ది సేపటికే ఉడికిందని తెలిపారు.