తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2020, 11:55 AM IST

ETV Bharat / state

'ప్రజా ఆమోదంగా ప్రణాళికలు ఉండాలి'

ప్రజల ఆమోదం పొందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మహబూబాబాద్​​ జిల్లా మరిపెడలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

pattana pragathi program in devarakadra
'ప్రజామోదంగా ప్రణాళికలు ఉండాలి'

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్​​ జిల్లా మరిపెడలో జరుగుతున్న కార్యక్రమంలో కలెక్టర్​ వీపీ గౌతమ్​ పాల్గొన్నారు. ఖాళీ ప్రదేశంలో ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతికి సంబంధించి పలు సూచనలు చేశారు.

అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో నలుగురు పిల్లలే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు బొమ్మలు, చిత్రాలు చూపించి పేర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

'ప్రజామోదంగా ప్రణాళికలు ఉండాలి'

ఇదీ చూడండి:ఏకాంత చిత్రాలు.. వీడియోలతో మాజీ భర్త వేధింపులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details