మేడారం మహాజాతరలో తొలి ఘట్టం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగొండ్ల నుంచే ప్రారంభమవుతుంది. పొనుగొండ్ల పుత్రుడైన పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబై మేడారానికి బయల్దేరడంతో ఉత్సవాలు మొదలవుతాయి. సమ్మక్క-పగిడిద్దరాజు కల్యాణానికి... ఊరంతా కలిసి డోలు వాద్యాలతో పగిడిద్దరాజును మేడారానికి తీసుకొస్తారు.
ఈ వేడుకల్లో భాగంగా... పొనుగొండ్ల ప్రజలు తమ ఇంళ్లకు మట్టిపూతలు పూసి, ముగ్గులతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని శుభ్రం చేసి ఆదివారం నుంచే పూజలు ప్రారంభించారు. మంగళవారం నాడు గుట్ట నుంచి స్వామివారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించి శాంతి పూజలు నిర్వహిస్తారు.