తెలంగాణ

telangana

ETV Bharat / state

పాసు పుస్తకాలు కావాలంటూ రైతుల నిరాహార దీక్ష - nirahara-deeksha

అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్​ చేస్తూ మహబూబాబాద్​ జిల్లా కురవిలో అన్నదాతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

రైతుల నిరాహార దీక్ష

By

Published : May 30, 2019, 8:53 PM IST

మహబూబాబాద్​ జిల్లా కురవిలో పట్టాదారు పాసుపుస్తకాల పోరాట సంఘం ఆధ్వర్యంలో అర్హులైన రైతులందరూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక తహశీల్దార్​ కార్యాలయంలో నిరసన చేపట్టి నినాదాలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని డిమాండ్​ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి నక్క సైదులు డిమాండ్ చేశారు.

రైతుల నిరాహార దీక్ష

ABOUT THE AUTHOR

...view details